Nellore: నెల్లూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు & బైక్ ర్యాలీ!

Nellore: పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నెల్లూరులో కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. జనసేన యువజన విభాగం ప్రారంభం, నాదెండ్ల మనోహర్ లోగోల ఆవిష్కరణ.

A Praveen, Nellore
Published on: 2 Sept 2026 12:15 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు & బైక్ ర్యాలీ!

Nellore: యువత కలలను సాకారం చేస్తూ, వారికి బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ నిరంతరం కృషి చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరులో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా, కొత్త తరాన్ని, యువతరాన్ని, నూతన శక్తిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జవాబుదారీతనం కలిగిన సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల తెలిపారు.

ర్యాలీ ప్రారంభానికి ముందు 16వ డివిజన్‌లోని చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న వినాయక స్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించాలని ప్రార్థించారు.

పూజా కార్యక్రమాల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజారంజకమైన, పారదర్శకమైన పాలన అందిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆశయస్ఫూర్తితో మరింత సమర్థవంతమైన ప్రజాపాలన సాగించాలని ఆకాంక్షిస్తూ, ఆయన చిత్రపటానికి దిష్టి తీశారు. ప్రజాసేవలో ఆయనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమాల ఆశీర్వాదాలతో బైక్ ర్యాలీని ప్రారంభించారు.

“బైక్‌కు గమ్యం ఎంత ముఖ్యమో… యువత జీవితానికి లక్ష్యం అంతే ముఖ్యం”

యువతకు ఎంతో ఇష్టమైన బైక్ ర్యాలీని ఒక సందేశాత్మక కార్యక్రమంగా మలుస్తూ, మన బైక్ మనల్ని గమ్యస్థానానికి చేర్చినట్లే, జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానివైపు నిరంతరం ప్రయాణిస్తే విజయాన్ని సాధించవచ్చని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ గారు యువత కోసం తపిస్తున్న విధానాలకు అనుగుణంగా యువతను ప్రజాసేవలో భాగస్వాములను చేయడమే యువజన విభాగం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం రేపటి బంగారు భవిత నిర్మాణానికి నాంది కావాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా అసమానతలు లేని సమాజ నిర్మాణం, అభివృద్ధికి నోచుకోని వర్గాలు లేకుండా చేయడం, పరస్పర స్నేహబంధాన్ని బలోపేతం చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటి పవన్ కళ్యాణ్ గారి సంకల్పాల సాధనకు యువత తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నెల్లూరు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏవీఎం కాంపౌండ్ వద్దకు చేరుకుని, జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతతో కలిసి ముందుకు సాగింది.

ర్యాలీ అనంతరం ఉదయం 10 గంటలకు యోజనా విభాగం, జనశ్రీన యోజనా విభాగం లోగోలను ఆవిష్కరించి, ఆ విభాగాల విధివిధానాలను జనసేన పార్టీ నాయకులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు వివరించనున్నారు. అనంతరం యువజన విభాగాన్ని అధికారికంగా ప్రారంభించనున్నాము అని నిర్వాహకులు తెలిపారు. యువతను సంఘటితం చేసి, ప్రజాసేవ, సామాజిక బాధ్యత, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేయడమే ఈ విభాగాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

కిషోర్ గునుకుల సందేశం

“యువత కలలు కనే తరం మాత్రమే కాదు… ఆ కలలను నిజం చేసే శక్తి. ఆ శక్తిని ప్రజాసేవలో భాగస్వామ్యం చేస్తూ, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో యువతను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా రేపటి బంగారు భవిష్యత్తుకు యువత పునాదిగా నిలవాలి.”

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కిషోర్ గునుకుల మరియు జనసేన కుటుంబం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, వారి సతీమణి విజయలక్ష్మి గునుకుల, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, నాగేంద్ర బాలు, నరహరి, శరవణ, ప్రతాప్, ప్రవల్లిక,విజయ,కృష్ణ మోహన్ రెడ్డి, మల్లిరెడ్డి, వేముల శివకృష్ణ, వేముల హర్ష, కళ్యాణి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story