Kaluvai: ఉపాధ్యాయుడు నందకిషోర్ సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి

Kaluvai: కలువాయి గిరిజన కాలనీ పాఠశాల ఉపాధ్యాయుడు గుడుగుంట నందకిషోర్ ఉద్యోగ విరమణ సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు పాల్గొని అభినందించారు.

Madhav Goud, Nellore
Published on: 28 Jun 2026 7:20 PM IST
Kaluvai
X

Kaluvai: ఉపాధ్యాయుడు నందకిషోర్ సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి

కలువాయి: కలువాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలువాయి గిరిజన కాలనీ నందు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఈ మధ్య కాలంలోనే ఉద్యోగ విరమణ పొందిన గుడుగుంట నందకిషోర్ ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ మండల విద్యాశాఖ కార్యాలయము నందు జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి, అన్ని విధాల సమాజంతో పాటు ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది నేడు ఉద్యోగ విరమణ పొందినందుకు అభినందనలు తెలిపారు,వారు విద్యావ్యాప్తికి కృషిని అభినందించారు.

తనకు వారి కుటుంబంతో ఎంతగానో అనుబంధం ఉందని తెలిపారు. నందకిషోర్,శ్రీలత దంపతులను ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చల్లా రఘురామిరెడ్డి, చల్లా సుబ్బరామిరెడ్డి,మండల విద్యాశాఖ అధికారులు పి నవీన్ కుమార్, సడ్డ జనార్ధన రెడ్డి, చేజర్ల మండల విద్యాశాఖ అధికారి డిసి మస్తానయ్య, తడ మండల విద్యాశాఖ అధికారి కే మల్లికార్జున రావు, రెడ్డి కుమారి వెటర్నరీ డీడీ తిరుపతి

జిల్లా APTF బాధ్యులు JAC సెక్రటరీ జనరల్అల్లంపాటి సురేంద్ర రెడ్డి, పిచ్చి బాబు, టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ,బిజెపి నాయకులు దండు పెంచలయ్య , డాక్టర్ ఓబుల్ రాజు, మండల ఉపాధ్యాయ సంఘ బాధ్యులు జీవి మురళీకృష్ణ,కేవీ నారాయణరెడ్డి,ఎం శ్రీహరి, కే నాగరాజు, బి మురళి CRMT నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story