Nellore: నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం
Nellore: నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
Nellore: నెల్లూరు చెన్నై హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరం
Nellore: నెల్లూరు నగరంలోని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఆ సంస్థ అధినేత రమేష్ ఆధ్వర్యంలో.. ఆదివారం పింక్ లైన్స్ ఫెర్టిలిటీ క్లినిక్ అండ్ ఉమెన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ ఈ శిబిరానికి హాజరై ప్రారంభించారు.
ఈ శిబిరంలో 20 సంవత్సరాలకు పైగా ఫెర్టిలిటీ రంగంలో అనుభవం కలిగిన సీనియర్ డాక్టర్ ఝాన్సీ వనిత కుమారి పాల్గొని సేవలందించారు. సుమారు వందమందికి పైగా ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని సేవలు పొందారు. అలాగే వారికి థైరాయిడ్, ప్రొలాక్టిన్, రక్త శాతం, షుగర్, స్కానింగ్ తోపాటు పలు రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ మాట్లాడుతూ.. చెన్నైలో అత్యుత్తమ డాక్టర్లను తీసుకొని వచ్చి ప్రజలకు అనేక ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు సేవలు అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.




