Gudur: గూడూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం!

Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులోని పాఠశాల ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎఫ్‌ఆర్‌ఓ ప్రసాద్ పిలుపునిచ్చారు.

B NARASIMHA, GUDUR
Published on: 25 Aug 2026 3:58 PM IST
Gudur
X

Gudur: గూడూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం!

Gudur: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని స్థానిక పాఠశాల ఆవరణలో అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) ప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్లను పెంచడం ద్వారా మాత్రమే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు కూడా చిన్నతనం నుంచే ప్రకృతి ప్రేమికులుగా మారి, మొక్కలను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.

అనంతరం పాఠశాల ప్రాంగణంలో అధికారులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story