Train Accident: స్కూల్ వ్యాన్పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి!
Train Accident: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. క
Train Accident: స్కూల్ వ్యాన్పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి!
Train Accident: పశ్చిమ బెంగాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ముర్షిదాబాద్ జిల్లాలో ఒక పాఠశాల వ్యాన్ను ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
స్థానిక సమాచారం ప్రకారం.. నిమ్తీతా-కటవా మార్గంలో వెళ్తున్న ప్యాసింజర్ రైలు కర్ణసువర్ణ రైల్వే గేట్ వద్దకు వచ్చేసరికి ట్రాక్ తెరిచే ఉంది. అదే సమయంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన రైలు వ్యాన్ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు స్కూల్ వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. ఘటనా స్థలానికి సంబంధించిన భీతావహ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైల్వే అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గేట్ కీపర్ నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.




