త్వరలో టూవీలర్ అంబులెన్స్లు.. కొత్త ప్రతిపాదనతో కేంద్రం నోటిఫికేషన్..!
Two Wheeler Ambulances: మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన అత్యవసర వైద్య సేవల కోసం ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతినిస్తూ కేంద్ర రహదారులు, రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
త్వరలో టూవీలర్ అంబులెన్స్లు.. కొత్త ప్రతిపాదనతో కేంద్రం నోటిఫికేషన్..!
Two Wheeler Ambulances: దేశంలోని గ్రామీణ, మారుమూల మరియు కొండ ప్రాంతాల ప్రజలకు వేగవంతమైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహన అంబులెన్సులకు అధికారికంగా అనుమతి ఇవ్వాలని నిశ్చయించింది. ఇందుకోసం ‘కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989’ కి అవసరమైన సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ సంచలన ముసాయిదా నోటిఫికేషన్ను జారీ చేసింది.
ఇప్పటివరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనల పరిధిలో ద్విచక్ర అంబులెన్సులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు లేవు. దీనివల్ల వాటి రూపురేఖలు, నిర్వహణ ప్రమాణాలు, రోగులను సురక్షితంగా తీసుకెళ్లే విధానం, రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ తనిఖీలను అధికారికంగా ఖరారు చేయడం సాధ్యపడలేదు. ప్రస్తుత చట్ట సవరణ ద్వారా ఈ అంబులెన్సులన్నీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ నియంత్రణ మరియు పర్యవేక్షణ పరిధిలోకి రానున్నాయి.
నూతన ముసాయిదా నిబంధనల ప్రకారం.. ‘ఎల్2 కేటగిరీ’కు చెందిన ద్విచక్ర వాహనాలను మాత్రమే అంబులెన్సులుగా మార్చుకోవడానికి మరియు ఉపయోగించడానికి అనుమతిస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రత్యేకాధికార ప్రాంతాలలో మాత్రమే ఇవి సేవలు అందించడానికి వీలుంటుంది.
కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన ఈ ముసాయిదా నోటిఫికేషన్పై ఏవైనా సలహాలు లేదా అభ్యంతరాలు ఉన్నవారు 30 రోజుల్లోగా సంబంధిత శాఖకు లిఖితపూర్వకంగా పంపాల్సి ఉంటుంది. అందిన అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నోటిఫికేషన్ను జారీ చేయనుంది.




