PM Modi: విద్యార్థులకు ప్రధాని మోదీ హెచ్చరికలంటూ వీడియో వైరల్.. పిఐబి షాకింగ్ నిజాలు!
PM Modi: ఆందోళనలు చేసే విద్యార్థులపై చర్యలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించినట్లు వైరల్ అవుతున్న వీడియో నకిలీదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
PM Modi: విద్యార్థులకు ప్రధాని మోదీ హెచ్చరికలంటూ వీడియో వైరల్.. పిఐబి షాకింగ్ నిజాలు!
PM Modi: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు తెలిపే విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్గా మారడంతో విద్యార్థుల్లో, నెటిజన్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగం అయిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) త్వరితగతిన స్పందించి అసలు నిజాన్ని వెల్లడించింది.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో పూర్తిగా నకిలీ (Fake AI Video) అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డీప్ఫేక్ సాంకేతికతను ఉపయోగించి ప్రధాని మోదీ గొంతును, రూపాన్ని మార్ఫింగ్ చేశారని వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, ఆ వ్యాఖ్యలు ప్రధాని చేసినవి కావని తేల్చి చెప్పింది.
పరీక్షా విధానంలో కీలక సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని (Nandan Nilekani) నేతృత్వంలో ఒక హైపవర్డ్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఒక అధికారిక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు.
కొందరు సైబర్ వికృత మనస్కులు, నెట్వర్క్లు ఆ ఒరిజినల్ వీడియోను ఏఐ సహాయంతో మార్ఫింగ్ చేసి, విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లుగా తప్పుడు మాటలను జోడించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పిఐబి తెలిపింది.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని పిఐబి ప్రజలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వానికి, వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద లేదా ఫేక్ కంటెంట్ (Fake Content) ప్రజల దృష్టికి వస్తే వెంటనే తమ పిఐబి ఫ్యాక్ట్ చెక్ టీమ్కు రిపోర్ట్ చేయాలని కోరింది. ఇలాంటి నకిలీ, మార్ఫింగ్ వీడియోలను షేర్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది.




