Toll Plazas: టోల్ ప్లాజాల వద్ద ఇక ‘నో క్యాష్’.. కొత్త రూల్స్ ఎప్పటి నుంచంటే?

Toll Plazas: నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి అలర్ట్! ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్, యూపీఐ నిబంధనలు మరియు జరిమానాల పూర్తి వివరాలు ఇక్కడ..

Arun Chilukuri
Published on: 6 April 2026 11:54 AM IST
Toll Plazas
X

Toll Plazas: టోల్ ప్లాజాల వద్ద ఇక ‘నో క్యాష్’.. కొత్త రూల్స్ ఎప్పటి నుంచంటే?

Toll Plazas: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై టోల్ రుసుమును కేవలం డిజిటల్ పద్ధతుల్లోనే స్వీకరించనున్నారు.

కొత్త నిబంధనల ముఖ్యాంశాలు:

డిజిటల్ పేమెంట్స్ మాత్రమే: టోల్ ప్లాజాల వద్ద నగదు కౌంటర్లు పూర్తిగా మూతపడనున్నాయి. కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారానే రుసుము చెల్లించాలి.

ఫాస్టాగ్ లేకపోతే అదనపు భారం: వాహనానికి ఫాస్టాగ్ లేని పక్షంలో, యూపీఐ ద్వారా సాధారణ టోల్ ధర కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఐడీ కార్డుల విధానానికి స్వస్తి: గతంలో ఐడీ కార్డులు చూపించి టోల్ మినహాయింపు పొందే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మినహాయింపు పరిధిలోకి వచ్చే అధికారులు కూడా తప్పనిసరిగా 'ఎగ్జెంప్టెడ్ ఫాస్టాగ్' కలిగి ఉండాలి. అది లేకపోతే టోల్ కట్టాల్సిందే.

వార్షిక పాస్ సౌకర్యం: నిత్యం ప్రయాణించే వారి కోసం రూ. 3,075 తో వార్షిక పాస్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఈ-నోటీసులు మరియు జరిమానాలు:

ఒకవేళ టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనాలను నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించి, యజమాని మొబైల్ లేదా ఈమెయిల్‌కు ఈ-నోటీసు పంపుతారు.

నోటీసు అందిన 72 గంటల్లోపు బకాయి చెల్లిస్తే జరిమానా ఉండదు.

గడువు దాటితే మాత్రం జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని అధికారులు హెచ్చరించారు.

టోల్ ప్లాజాల వద్ద సిబ్బందితో వివాదాలను నివారించడానికి, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి వాహనదారులు తమ వాహనాలకు వెంటనే ఫాస్టాగ్ అమర్చుకోవాలని సూచిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story