PM Modi: జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు!
PM Modi: జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రోను అభినందించిన ప్రధాని మోదీ.
PM Modi: జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు!
PM Modi: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్17 (GSLV-F17) వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్17 ద్వారా జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భారత్ ప్రయోగించిన మొట్టమొదటి ఇమేజింగ్ శాటిలైట్ 'ఈవోఎస్-05' (EOS-05)ను సబ్-జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న సాంకేతిక పురోగతికి, నూతన ఆవిష్కరణలకు ఈ ప్రయోగం నిదర్శనమని ప్రధాని మోదీ కొనియాడారు. ఇస్రో మరియు దేశీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
ఈ అత్యాధునిక ఉపగ్రహం ద్వారా దేశ భద్రత మరింత పటిష్టం కానుంది. సరిహద్దుల్లో శత్రు దేశాలు రహస్యంగా ఏర్పాటు చేసే సైనిక స్థావరాలను కూడా ఈ శాటిలైట్ ఇట్టే పసిగట్టగలదు. అంతేకాకుండా, భవిష్యత్తులో సంభవించే ప్రకృతి విపత్తులను, వాటి తీవ్రతను ముందస్తుగా అంచనా వేయడానికి ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది.




