Work From Home: మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’? ఐటీ రంగంలో మొదలైన కొత్త చర్చ!
Work From Home: చమురు సంక్షోభం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు.
Work From Home: మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’? ఐటీ రంగంలో మొదలైన కొత్త చర్చ!
Work From Home: పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ చమురు సంక్షోభం ఐటీ రంగంలో పెను మార్పులకు సంకేతాలు ఇస్తోంది. చమురు పొదుపు చర్యల్లో భాగంగా సాధ్యమైనంత వరకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) విధానాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ప్రధాని సూచనపై ఐటీ దిగ్గజాల సంస్థ నాస్కామ్ (NASSCOM) ఆచితూచి స్పందించింది. ఐటీ కంపెనీలు ఇప్పటికే 'హైబ్రిడ్ పని విధానాన్ని' (Hybrid Model) విజయవంతంగా అమలు చేస్తున్నాయని గుర్తు చేసింది. అయితే, రిమోట్ వర్క్ అనేది పూర్తిగా ఆయా కంపెనీల అవసరాలు, క్లయింట్ నిబంధనలు మరియు ఉద్యోగుల బాధ్యతలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం ఇంటి నుంచి పని మాత్రమే కాకుండా, కార్యాలయాల్లో విద్యుత్ ఆదా వంటి ఇతర చర్యల ద్వారా కూడా పర్యావరణ హితానికి మొగ్గు చూపుతున్నామని వెల్లడించింది.
మరోవైపు, ఐటీ ఉద్యోగ సంఘం ‘నైట్స్’ (NITES) ఈ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ను ఐటీ రంగంలో తప్పనిసరి చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ప్రయోజనాలు: ఇంధన పొదుపుతో పాటు ట్రాఫిక్ కష్టాలు తగ్గడం, కాలుష్య నియంత్రణ.
మౌలిక సదుపాయాలు: కోవిడ్ సమయంలో ఇప్పటికే నిర్మించుకున్న రిమోట్ వర్క్ సెటప్ను వృథా చేయకుండా మళ్లీ వాడుకోవాలని సూచించింది.
గత ఏడాది కాలంగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కంపెనీలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కానీ, గల్ఫ్ సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోయే అవకాశం ఉండటంతో, రవాణా భారం తగ్గించుకోవడానికి కంపెనీలు కూడా మళ్లీ ఇంటి నుంచి పని వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.




