Bengaluru Traffic: ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వైట్ఫీల్డ్కు 3 గంటల ప్రయాణం.. వైరల్ వీడియో
Bengaluru Traffic: ఎలక్ట్రానిక్ సిటీ నుండి వైట్ఫీల్డ్కు వెళ్లేందుకు 3 గంటలు పట్టిందని ఇన్స్టాగ్రామ్లో ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
Bengaluru Traffic: ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వైట్ఫీల్డ్కు 3 గంటల ప్రయాణం.. వైరల్ వీడియో
Bengaluru Traffic: దేశీయ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ మరియు గుంతల రోడ్ల కష్టాలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రానిక్ సిటీ నుండి వైట్ఫీల్డ్కు వెళ్లేందుకు ఆటోరిక్షాలో ఒక మహిళకు ఏకంగా మూడు గంటల సమయం పట్టడం, ఆ ఘోర అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో నగర ట్రాఫిక్ పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నీ యాదవ్ అనే మహిళ తన ప్రయాణంలోని దృశ్యాలను ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పోస్ట్ చేస్తూ, నగరంలోని రోడ్ల దుస్థితిని వీక్షకులకు ఎత్తిచూపారు.
ఈ ప్రయాణంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. "బెంగళూరులోని ప్రధాన రహదారుల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూస్తే అసలు ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాడానికి ఎలా ధైర్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. అందుకే నేను ఇంటి నుంచి బయటకు రావడం దాదాపుగా మానేశాను" అని వీడియోలో వ్యాఖ్యానించారు. ఈ క్లిప్ నెట్టింట వైరల్గా మారడంతో బెంగళూరు ఐటీ ఉద్యోగులు మరియు నగరవాసులు పెద్ద ఎత్తున స్పందించారు.
రోజువారీ ప్రయాణాల్లో మూడు గంటలు నరకం చూడాల్సి వస్తోందని, బెంగళూరు ట్రాఫిక్ ప్రతిరోజూ తమ సహనాన్ని పరీక్షిస్తోందని నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఇలాంటి దారుణమైన రహదారులు, ట్రాఫిక్ రద్దీ వల్లే చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పనిచేయడానికి (Work From Home) మొగ్గు చూపుతున్నారని కామెంట్ల రూపంలో తమ నిరసనను వ్యక్తం చేశారు.




