Nalgonda: రైస్ మిల్లర్ల మహాధర్నాకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు
Nalgonda: నల్లగొండలో రైస్ మిల్లర్ల మహాధర్నాకు సీపీఎం మద్దతు. మిల్లర్ల వేధింపులు ఆపాలని, సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్.
Nalgonda: రైస్ మిల్లర్ల మహాధర్నాకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు
నల్గొండ: నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రైస్ మిల్లర్ల మహాధర్నాకు సీపీఎం పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు పూర్తి మద్దతు తెలిపారు.
ఈ ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న పెనాల్టీలు, అధిక వడ్డీలు, భౌతిక తనిఖీల (Physical Verification) పేరుతో వేధింపుల నుంచి ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియలో రైస్ మిల్లర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వం వారికి తగిన మద్దతు ఇచ్చి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.




