Nalgonda: జీజీహెచ్‌లో శిశువు మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

Nalgonda: నల్గొండ జీజీహెచ్‌లో గర్భస్థ శిశువు మృతి చెందడంపై సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలపై కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 28 Aug 2026 8:45 PM IST
Nalgonda
X

Nalgonda: జీజీహెచ్‌లో శిశువు మృతిపై విచారణకు కలెక్టర్ ఆదేశం

నల్గొండ: నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (GGH)లో గర్భస్థ శిశువు మృతి చెందడంపై సోషల్ మీడియాలో ప్రచారమైన కథనాలపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఈ నెల 27న మధ్యాహ్నం 12:55 గంటలకు కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు.27 మధ్యాహ్నం, రాత్రితో పాటు 28 ఉదయం వరకు జరిపిన పరీక్షల్లో శిశువు గుండెచప్పుడు సాధారణంగానే ఉన్నట్లు,తల్లి ఆరోగ్యం కూడా స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.28 ఉదయం 6:15 గంటలకు శిశువు కదలికలు తగ్గడంతో లేబర్ రూమ్‌కు తరలించి, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా గుండెచప్పుడు నిలిచిపోయినట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించి, వీడియో కౌన్సిలింగ్ నిర్వహించారు.గతంలో సిజేరియన్ అయినందున, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఉదయం 7:15 గంటలకు అత్యవసర శస్త్రచికిత్స ద్వారా మృత శిశువును బయటకు తీశారు. తల్లి ఆరోగ్యం ప్రస్తుతం సురక్షితంగా ఉంది.శిశువు మరణాన్ని ఊహించని, కారణం తెలియని గర్భస్థ శిశు మరణం (Unexplained Stillbirth)గా సూపరింటెండెంట్ తన నివేదికలో నిర్ధారించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story