Nalgonda: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి: నల్లగొండ కలెక్టర్!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన గోడపత్రికను కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆవిష్కరించారు.
Nalgonda: ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి: నల్లగొండ కలెక్టర్!
నల్లగొండ: బ్యాంకు లావాదేవీలు, పథకాలపై ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 'ఆర్థిక అక్షరాస్యత' అవగాహన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిపాజిట్లు, నగదు ఉపసంహరణ, రుణాల మంజూరు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల రుణ వివరాలను అక్షరాస్యత కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 9 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటిలోని ప్రతినిధులు గ్రామాల్లో ఉచితంగా అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story




