Nalgonda: కలెక్టర్ బి. చంద్రశేఖర్కు రాఖీలు కట్టిన అనాథాశ్రమ బాలికలు!
Nalgonda: రక్షాబంధన్ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్కు పాన్గల్ చారుమతి అనాథాశ్రమ బాలికలు రాఖీలు కట్టారు.
Nalgonda: కలెక్టర్ బి. చంద్రశేఖర్కు రాఖీలు కట్టిన అనాథాశ్రమ బాలికలు!
నల్గొండ: అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల ప్రేమానురాగాలకు, ఆత్మీయ అనుబంధానికి రక్షాబంధన్ పండుగ నిదర్శనమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి సోదరుడు కలకాలం రక్షణగా, తోడుగా ఉంటాననే కొండంత భరోసాను ఈ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్లో పాన్గల్లోని చారుమతి అనాథాశ్రమానికి చెందిన బాలికలు కలెక్టర్ను కలసి ఆప్యాయంగా రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన స్వీట్లు తినిపించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు అందజేశారు.
Next Story




