Nalgonda: ఇందిరా భవన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా దర్బార్!
Nalgonda: ఇందిరా భవన్ క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Nalgonda: ఇందిరా భవన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజా దర్బార్!
నల్గొండ: నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ గల క్యాంపు కార్యాలయంలో (ఇందిరా భవన్) శనివారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకోగా.
ఆయన ప్రతి వినతిని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, అర్జీలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Next Story




