Kethepalli: కనకదుర్గ స్టీల్స్-2 పరిశ్రమలో కార్మికుల ధర్నా

Kethepalli: కేతేపల్లి మండలం చీకటిగుండెలోని కనకదుర్గ స్టీల్స్-2లో కార్మికులు ధర్నాకు దిగారు. పని భారం తగ్గించి, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 3 Sept 2026 7:10 PM IST
Kethepalli
X

Kethepalli: కనకదుర్గ స్టీల్స్-2 పరిశ్రమలో కార్మికుల ధర్నా

కేతేపల్లి: కేతేపల్లి మండలం చీకటిగుండె గ్రామంలో ఉన్న కనకదుర్గ స్టీల్స్–2 ఐరన్ తయారీ యూనిట్‌లో కార్మికులు ధర్నాకు దిగారు. యాజమాన్యం అధిక పని భారం మోపుతూ, తక్కువ వేతనాలతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కార్మికులు ఆరోపించారు.

కార్మికుల వివరాల ప్రకారం.. గతంలో సుమారు 150 మంది కార్మికులతో నిర్వహించాల్సిన ప్రొడక్షన్ పనిని ప్రస్తుతం కేవలం 50 మందితోనే చేయించుకుంటున్నారని తెలిపారు. దీంతో ఒక్కో కార్మికుడిపై పని భారం భారీగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా కార్మికులకు PF, ESI వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తక్కువ వేతనాలతో ఎక్కువ గంటలు పని చేయిస్తూ, కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతి నెలా వేతనాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారని, నెలసరి వేతనాన్ని ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, పని భారం తగ్గించి తగినంత మంది కార్మికులను నియమించాలని కోరారు.

కార్మికుల సమస్యలపై సంబంధిత కార్మిక శాఖ అధికారులు స్పందించి కనకదుర్గ స్టీల్స్–2లో పని పరిస్థితులు, వేతనాలు, PF, ESI తదితర అంశాలపై విచారణ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story