Mahesh: 'త్వరలోనే నిజాలు చెబుతా'.. ఎమోషనల్ వీడియోతో రంగస్థలం మహేష్!
Mahesh: జబర్దస్త్' షోతో నవ్వులు పంచిన మహేష్ ఆచంట, తన విలక్షణ నటనతో 'రంగస్థలం', 'మహానటి' వంటి చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Mahesh: 'త్వరలోనే నిజాలు చెబుతా'.. ఎమోషనల్ వీడియోతో రంగస్థలం మహేష్!
Mahesh: 'జబర్దస్త్' షోతో నవ్వులు పంచిన మహేష్ ఆచంట, తన విలక్షణ నటనతో 'రంగస్థలం', 'మహానటి' వంటి చిత్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుడు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ వీడియో ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జీవితం పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఏం జరిగింది? ఆ వీడియోలోని సారాంశం ఇదే..
మహేష్ ఆచంట తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందులో ఆయన ఎంతో భావోద్వేగంతో, గంభీరంగా కనిపిస్తూ.. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేమని పేర్కొన్నారు. బయట కనిపించే దృశ్యాలను బట్టి లేనిపోని కల్పిత కథనాలను అల్లడం సరికాదని ఆయన సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మీమర్స్, యూట్యూబ్ క్రియేటర్లు , రిపోర్టర్లను ఉద్దేశించి ఆయన ఒక కీలక విజ్ఞప్తి చేశారు. తాను స్వయంగా మీడియా ముందుకు వచ్చి అసలు నిజం చెప్పేంతవరకు, దయచేసి ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని, సొంత ఊహలతో థంబ్ నైల్స్ సృష్టించవద్దని ఆయన కోరారు. త్వరలోనే తానే పూర్తి వివరాలతో స్పష్టత ఇస్తానని ఆయన వెల్లడించారు.
అభిమానుల్లో ఆందోళన.. ప్రామోషనల్ స్టంటేనా?
మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఆయన జీవితంలో ఏం జరిగిందనే ఆందోళన ఒకవైపు అభిమానులను వెంటాడుతోంది. మరోవైపు, ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు తమ కొత్త ప్రాజెక్టుల ప్రమోషన్ల కోసం ఇలాంటి 'పబ్లిసిటీ స్టంట్స్' చేయడం సర్వసాధారణమైపోయింది. గతంలో కూడా కొందరు కమెడియన్లు ఇలాగే సంచలన వీడియోలు పోస్ట్ చేసి, చివరికి అవి ఏదో వెబ్ సిరీస్ లేదా సినిమా ప్రమోషన్లని తేల్చారు. అందుకే నెటిజన్లు ఇది మహేష్ ఆచంట కొత్త సినిమా కోసమేనా లేక నిజంగానే ఆయన పర్సనల్ లైఫ్లో ఏదైనా ఇబ్బంది ఉందా అని ఆరా తీస్తున్నారు.




