Pandu Master: డ్యాన్స్ మాస్టర్ పండు కాళ్లకు శస్త్రచికిత్స.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విశాఖ మెడికవర్ వైద్యులు!
Pandu Master: విశాఖపట్నం ఆనందపురం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్ పండు (జి. షణ్ముఖ) ఆరోగ్య పరిస్థితిపై మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కీలక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Pandu Master: డ్యాన్స్ మాస్టర్ పండు కాళ్లకు శస్త్రచికిత్స.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విశాఖ మెడికవర్ వైద్యులు!
Pandu Master: విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు (జి. షణ్ముఖ) ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను విశాఖపట్నంలోని మెడికవర్ (Medicover Hospital) ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు అందిస్తున్న చికిత్స వివరాలను డాక్టర్లు మీడియాకు వివరించారు.
మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోడ్డు ప్రమాదంలో పండు రెండు కాళ్లకు చాలా బలంగా, తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు (ఎక్స్-రే, స్కాన్ తదితర) నిర్వహిస్తున్నారు. పరీక్షల నివేదికలు రాగానే.. పండు రెండు కాళ్లకు అత్యవసరంగా శస్త్రచికిత్స (Operation) చేయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే పూర్తి చేశాయి.
ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత.. పండు మాస్టర్ కనీసం ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి (Complete Bed Rest) తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా విశ్రాంతి తీసుకుంటేనే ఆయన కాళ్లు త్వరగా కోలుకుంటాయని, మళ్లీ పాతపద్ధతిలో నడవగలుగుతారని వెల్లడించారు.
మరోవైపు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఆనందపురం పోలీసులు మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న పండు మాస్టర్ను, ఆయన తోటి ప్రయాణికులను కలిసి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యంపై బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు, టెలివిజన్ ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.




