Allu Arjun : అల్లు అర్జున్‌కు కోర్టు షాక్.. సంధ్య కేసులో హాజరు తప్పదు.!

Allu Arjun : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ స్టార్

G Krishna
Published on: 19 Jun 2026 2:20 PM IST
Allu Arjun
X

Allu Arjun

Allu Arjun : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు (నోటీసులు) జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా వచ్చే సోమవారం నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామం టాలీవుడ్‌తో పాటు అల్లు అర్జున్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అల్లు అర్జున్ ఏ-11.. కోర్టు సీరియస్

'పుష్ప-2' సినిమా విడుదల సమయం నాటి సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నాంపల్లి కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన నివేదికల ప్రకారం అల్లు అర్జున్‌ను A11 (11వ నిందితుడు) గా చేర్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన న్యాయస్థానం, ఈ కేసులో ఉన్న లూప్‌హోల్స్‌ను, బాధ్యతలను తేల్చడానికి అల్లు అర్జున్‌తో పాటు మిగిలిన కీలక నిందితులు కూడా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది.

19 మందికి సమన్లు.. 23 మందిపై ఛార్జ్‌షీట్

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయి పరిశోధన జరిపి, మొత్తం 23 మంది నిందితులపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు.. తాజాగా అల్లు అర్జున్‌తో సహా మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులంతా సోమవారం ఖచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని జడ్జి ఆదేశించారు.

అసలేం జరిగింది..?

'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మృతురాలి కుటుంబానికి అల్లు అర్జున్ ఆర్థికంగా అండగా నిలిచినప్పటికీ, భద్రతా లోపాలు , నిబంధనల ఉల్లంఘనల కింద నమోదైన ఈ క్రిమినల్ కేసు విచారణ మాత్రం ప్రస్తుతం కోర్టు పరిధిలో కొనసాగుతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story