Medak: మత్తులో ఆర్టీసీ డ్రైవర్.. నర్సాపూర్‌లో పోలీసుల ఎంట్రీ!

Medak: నర్సాపూర్‌లో మద్యం మత్తులో బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ తిరుమలేష్.

G Ashok Reddy, Narsapur
Published on: 4 May 2026 12:32 PM IST
Medak
X

Medak: మత్తులో ఆర్టీసీ డ్రైవర్.. నర్సాపూర్‌లో పోలీసుల ఎంట్రీ!

మెదక్ జిల్లా: మద్యం సేవించి ఆర్టీసీ బస్సు నడుపుతున్నడని బస్సు లో ఉన్న ప్రయాణికులు ఆందోళన చేయడం తో నర్సాపూర్ బస్సు స్టాండ్ లో బస్సు నువ్వు నిలిపివేశారు.మేడ్చల్ డిపోకు చెందిన తిరుమలేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ను మద్యం సేవించి బస్సు నడుపుతూన్నాడని బస్సు లో ఉన్న ప్రయాణికులు గుర్తించి వెంటనే మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించిన ప్రయాణికులు.

దీంతో పోలీసులు బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని బ్రీతింగ్ పరీక్ష చేయడంతో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.మేడ్చల్ నుండి నర్సాపూర్ వస్తున్న బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు,ప్రయాణికుల పట్ల డ్రైవర్ చిరాకు పడడంతో ప్రయాణికులు గుర్తించామని తెలిపారు. వెంటనే స్పందించిన నర్సాపూర్ ఆర్టీసీ అధికారులు నర్సాపూర్ బస్టాండ్ లో బస్సును నిలిపివేశారు.

G Ashok Reddy, Narsapur

G Ashok Reddy, Narsapur

Next Story