Siddipet: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Siddipet: వరస సెలవుల నేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. బోనాలు, పట్నాలతో మొక్కులు చెల్లింపు.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 16 Aug 2026 11:47 AM IST
Siddipet
X

Siddipet: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Siddipet: సిద్దిపేట జిల్లా చేర్యాల, ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఆలయ ప్రాంగణం లో గంగరేణి చెట్టుకు ముడుపులు కట్టి తమ కోరిక కోర్కెలు నెరవేర్చాలని కోరుకున్నారుపంచ రంగుల తో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకొని, అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో తెలిపారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story