Mancherial: మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లు తనిఖీలు రూ.4.79 కోట్ల అవకతవకల ఆరోపణలు

Mancherial: నెన్నెల మండలం నందులపల్లిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో రూ.4.79 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 27 Aug 2026 5:11 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల జిల్లాలో రైస్ మిల్లు తనిఖీలు రూ.4.79 కోట్ల అవకతవకల ఆరోపణలు

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో రూ.4.79 కోట్ల అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజావాణి కార్యక్రమంలో నెన్నెల గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ.. మిల్లులో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై విచారణ జరిపి, బాధ్యులపై కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి నష్టం జరిగిన మొత్తాన్ని రికవరీ చేయాలని కోరారు.

ఈ ఫిర్యాదు మేరకు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గురువారం శ్రీ లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లును తనిఖీ చేశారు. మిల్లులోని ధాన్యం నిల్వలు, రికార్డులు, ఇతర వివరాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలో సేకరించిన వివరాల ఆధారంగా నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ వెల్లడించారు.

కాగా, మిల్లుకు సంబంధించిన ప్రభుత్వ ధాన్యం లెక్కల్లో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే రూ.4.79 కోట్ల మేర నష్టం జరిగిందన్న ఆరోపణలు అధికారుల విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. మిల్లు నిర్వాహకులపై వచ్చిన ఆరోపణలు కూడా విచారణ అనంతరం తేలాల్సి ఉంది.అధికారుల తనిఖీ నివేదిక, తదుపరి చర్యలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story