Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం: వడదెబ్బతో బర్రెల కాపరి మృతి!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని పెద్దనపల్లిలో తీవ్ర విషాదం. ఎండల తీవ్రతకు బర్రెల కాపరి పోలగాని వెంకటేష్ వడదెబ్బతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 May 2026 10:45 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం: వడదెబ్బతో బర్రెల కాపరి మృతి!

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ప్రాంతంలోని పెద్దనపల్లి గ్రామంలో వడదెబ్బ ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. తీవ్ర ఎండల కారణంగా బర్రెల కాపరిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందడం స్థానికంగా కలచివేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం, పెద్దనపల్లి గ్రామానికి చెందిన పోలగాని వెంకటేష్ (తండ్రి పోశం) రోజువారీగా బర్రెలను మేపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం ఉదయం ఎప్పటిలాగే బర్రెలను మేపేందుకు వెళ్లిన వెంకటేష్, మండుతున్న ఎండలో గంటల పాటు బయటే గడిపాడు.

సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న అనంతరం అతడు తీవ్ర నీరసం, అస్వస్థతతో పాటు వడదెబ్బ లక్షణాలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ, తీవ్రమైన వడదెబ్బ ప్రభావంతో ఆరోగ్యం మరింత క్షీణించి వెంకటేష్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story