Chennur: కరెంటు తీగలు తెగిపడి 5 మేకలు మృతి

Chennur: చెన్నూరు మండలం రాయిపేటలో విద్యుత్ మెయిన్ లైన్ వైరు తెగిపడి 5 మేకలు అక్కడికక్కడే మృతి. రూ.60 వేల నష్టం.. పరిహారం అందించాలని యజమాని డిమాండ్.

RAJENDER, CHENNUR
Published on: 29 July 2026 7:28 PM IST
Chennur
X

Chennur: కరెంటు తీగలు తెగిపడి 5 మేకలు మృతి

చెన్నూరు: చెన్నూరు మండలంలో కరెంటు మెయిన్ లైన్ తెగి పడడంతో 05 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. చెన్నూరు మండలంలోని రాయిపేట గ్రామ శివారులోని పోలాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరు పట్టణానికి చెందిన గొల్ల మధు మేకలు కాసేందుకు తన మేకలను మేతకు తీసుకొని వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాయిపేట గ్రామం వద్ద విద్యుత్ శాఖ గురై తన మేకలు మృతి చెందాయని పేర్కొన్నాడు.

అయితే పొలం సమీపంలో ఉన్న కరెంటు మెయిన్ లైన్ తెగి పడడంతోనే తన మేకలు చనిపోయినట్టు మేకల యజమాని తెలిపాడు. తన జీవనాధారమైన మేకలు మృతి చెందడంతో సుమారు 60 వేల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని మేకల యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటన సమయంలో పరిసర ప్రాంతాలలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదే ఎవరైనా మనుషులు విద్యుత్ షాకు గురైతే ప్రాణాపాయం జరిగి ఉండేదని స్థానికులు మండిపడ్డారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన మేకలు చనిపోయాయని మేకల యజమాని మండిపడ్డాడు.

విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు గల కారణాలను సేకరిస్తున్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story