Bellampalli: బెల్లంపల్లిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కౌన్సిలర్ ఫిర్యాదు
Bellampalli: బెల్లంపల్లి 3వ వార్డులో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై గ్రీవెన్స్లో సబ్ కలెక్టర్కు కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ ఫిర్యాదు.
Bellampalli: బెల్లంపల్లిలో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కౌన్సిలర్ ఫిర్యాదు
బెల్లంపల్లి: 3వ వార్డ్ పరిధిలోని సర్వే నంబర్ 170/పిపి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది బడానేతలు కబ్జా చేసి, ప్లాట్లుగా వాటాలు వేసి అమ్ముతున్నారని కౌన్సిలర్ శ్రీమతి బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ గారు ఆరోపించారు.
కబ్జాదారులు ఆ భూమిలో సరిహద్దులు కూడా ఏర్పాటు చేసుకున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి, వార్డ్ అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు.
ఈ రోజు గ్రీవెన్స్ సెల్ లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గారికి వ్రాతపూర్వక ఫిర్యాదు అందజేసిన కౌన్సిలర్ గారు, "సర్వే నంబర్ 170/పిపి ప్రభుత్వ భూమిని వెంటనే సరిహద్దులతో సహా తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడే వరకు పోరాటం ఆగదని కౌన్సిలర్ గారు స్పష్టం చేశారు.
Next Story




