Wanaparthy: పెబ్బేరులో 'లక్ష యువగళ గీతార్చన' పుస్తకాల పంపిణీ

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు అయ్యప్ప స్వామి ఆలయంలో వారాహి నవరాత్రి వేడుకలు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో మహిళలు, భక్తులకు భగవద్గీత పుస్తకాల పంపిణీ.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 22 July 2026 4:33 PM IST
Wanaparthy
X

Wanaparthy: పెబ్బేరులో 'లక్ష యువగళ గీతార్చన' పుస్తకాల పంపిణీ

వనపర్తి: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న వారాహి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ లలితా త్రిపురసుందరి దేవి సన్నిధానంలో ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.

వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం అమ్మవారికి మహా మంగళహారతి సమర్పించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా, భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

వారాహి దేవి అత్యంత శక్తివంతమైన దేవతగా భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ మహిళలు విశేష భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, ప్రతి రోజూ భిన్నమైన అలంకరణలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. వివిధ పుష్పాలు, ఆభరణాలు, సంప్రదాయ అలంకరణలతో దర్శనమిచ్చిన శ్రీ వారాహి దేవిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా కీర్తిశేషులు వెంకటేశ్వర్ గౌడ్ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులు అభినందించారు.

ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, మహిళా భక్తులు, యువత, గ్రామ పెద్దలు మరియు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల "జై వారాహి మాత" నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story