Talakondapally: ఆపదలో ఉన్న కుటుంబానికి కాసు ఆర్థిక సహాయం
Talakondapally: రంగారెడ్డి జిల్లా అంతారంలో మృతి చెందిన మల్లయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.
Talakondapally: ఆపదలో ఉన్న కుటుంబానికి కాసు ఆర్థిక సహాయం
ఆపదలో అండగా... బాధలో భరోసాగా... మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం, అంతారం గ్రామానికి చెందిన ఎనుముల మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తమ వంతు సహాయంగా *రూ.4,000/-*లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాములు గౌడ్, భాగం మహేష్, అసిఫ్, భవాని, బాలయ్య, బైరపాక ఎల్లయ్య, ఇంద్రకంటి సాయిలు గౌడ్, ఎం.డి. ఇస్మాయిల్, బుడ్డ మహేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




