Pebbair: వైభవంగా ముగిసిన శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు!

Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వారాహి హోమం, అన్నదానంతో వైభవంగా ముగిశాయి.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 23 July 2026 7:47 PM IST
Pebbair
X

Pebbair: వైభవంగా ముగిసిన శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు!

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు ఆద్యంతం భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల చివరి రోజైన తొమ్మిదో రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, అమ్మవారికి వేద మంత్రోచ్చారణల నడుమ విశేష అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అమ్మవారి అనుగ్రహం కోసం వారాహి హోమం వైభవంగా నిర్వహించగా, హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. హోమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన నిర్వహించి అమ్మవారిని ప్రార్థించారు. అలాగే సంప్రదాయబద్ధంగా ఒడి బియ్యం సమర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి కుటుంబాల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని వేడుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష పూజలు, అలంకరణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల విశేష ఆదరణతో విజయవంతంగా జరిగాయని తెలిపారు. చివరి రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం విశేషంగా నిలిచిందన్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story