Amanagallu: సమస్యల పరిష్కారానికే వార్డుల్లో మార్నింగ్ వాక్ పత్యా నాయక్
Amanagallu: ఆమనగల్లు మున్సిపాలిటీలో చైర్మన్ పత్యా నాయక్ మార్నింగ్ వాక్. పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై వార్డుల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు.
Amanagallu: సమస్యల పరిష్కారానికే వార్డుల్లో మార్నింగ్ వాక్ పత్యా నాయక్
Amanagallu: ఆమనగల్లు మున్సిపాలిటీలోని సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్ నిర్వహించినట్లు మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ అన్నారు.సోమవారం మున్సిపాలిటీలో కౌన్సిలర్ అనూష శ్రీశైలం తో కలిసి వార్డుల్లో పర్యటించారు. రోడ్లపై మురుగునీరు నిల్వకుండా, దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మున్సిపాలిటీ సిబ్బంది, కాలనీవాసులతో కలిసి,ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ, సమస్యలను తెలుసుకొని క్రమానుగతంగా పరిష్కరిస్తామని తెలిపారు.
Next Story




