Veldanda: రోడ్డుపై గోతుల్లో వరి నాట్లు వేసి యువకుల నిరసన!

Veldanda: వెల్దండ-కంటోనిపల్లి రోడ్డుపై వరి నాట్లు వేసి యువతుల నిరసన. శంకుస్థాపన చేసి ఏడాది దాటినా బీటీ రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Aug 2026 2:13 PM IST
Veldanda
X

Veldanda: రోడ్డుపై గోతుల్లో వరి నాట్లు వేసి యువకుల నిరసన!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్ర నుంచి కంటోనిపల్లి బయలుదేరే రోడ్డుపై ఏర్పడిన భారీ గోతులలో ఆదివారం యువకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి సంవత్సరం గడుస్తున్న పనులు ప్రారంభం కాకపోవడంలేదని యువకులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ అంతా బురద మయంగా మారి, నడవడానికి కూడా వీలు లేకుండా అధ్వానంగా మారిందని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లిన పరిష్కరించకపోవడంతో వరి నాట్లు వేసి నిరసన తెలిపామన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ని ఇదే విషయంపై చరవాణి ద్వార సంప్రదించగా కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులు ప్రారంభమయ్యాలా చూస్తానని దాటవేశారని తెలిపారు ఇప్పటికైనా రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివప్రసాద్, యువకులు తేజ రాజు ప్రవీణ్ రాము శివ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story