Markapuram: బొమ్మలాపురంలో ఆవుల మందపై పెద్దపులి దాడి.. తీవ్ర గాయాలు!
Markapuram: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురంలో పెద్దపులి సంచారం. ఆవుల మందపై దాడి చేయడంతో ఆవుకు తీవ్ర గాయాలు. అటవీ అధికారులను కోరుతున్న గ్రామస్తులు.
Markapuram: బొమ్మలాపురంలో ఆవుల మందపై పెద్దపులి దాడి.. తీవ్ర గాయాలు!
Markapuram: దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలోని ఊరకొండ సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
ఆవుల మందపై ఒక్కసారిగా దాడి చేసిన పులి.. ఓ ఆవుపై దాడి చేయడంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పులి దాడిని గమనించిన ఆవుల కాపరులు అప్రమత్తమై అక్కడి నుండి తరలించారు
ఈ ఘటనతో బొమ్మలాపురం గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు ఆందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు స్పందించి పులి సంచారంపై నిఘా ఏర్పాటు చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.




