Kurnool: కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ బస్తిపాటి ఆకస్మిక తనిఖీ!

Kurnool: కర్నూలు కేంద్రీయ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 July 2026 6:25 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ బస్తిపాటి ఆకస్మిక తనిఖీ!

కర్నూలు: నగరంలోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో గల కేంద్రీయ విద్యాలయాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు...ఈ సందర్బంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను ఆయన పర్యవేక్షించారు.

తరగతి గదులను పరిశీలించి ఎలా చదువుతున్నారు, భవిష్యత్తు లో ఏమి కావాలని కోరుకుంటున్నారని విద్యార్థులతో మాట్లాడిన ఎంపీ, కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని సూచించారు.

అనంతరం విద్యార్థులకు మరింత నాణ్యమైన, అనుభవపూర్వకమైన విద్యను అందించాలని, మౌలిక సదుపాయాలలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందికి ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story