Kurnool: ఓర్వకల్లులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి!
Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Kurnool: ఓర్వకల్లులో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి!
Kurnool: ఓర్వకల్లు మండల కేంద్రం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి.
ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం నినాదాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. గ్రామంలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, మండల నాయకులు సంబధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Next Story




