Markapuram: విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ షాక్తో కార్మికుడు మృతి!
Markapuram: పెద్ద దోర్నాల విద్యుత్ సబ్స్టేషన్లో ఘోర ప్రమాదం. నూతన ట్రాన్స్ఫార్మర్ అమరుస్తుండగా విద్యుత్ షాక్తో చీరాలకు చెందిన కార్మికుడు దుర్గారావు మృతి.
Markapuram: విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ షాక్తో కార్మికుడు మృతి!
Markapuram: పెద్ద దోర్నాల విద్యుత్ సబ్స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నూతన ట్రాన్స్ఫార్మర్ను అమర్చే పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
చీరాలకు చెందిన నన్నం దుర్గారావు (55), తండ్రి రామదాసు విద్యుత్ సబ్స్టేషన్లో నూతన ట్రాన్స్ఫార్మర్ అమర్చే పనుల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్కు గురికావడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు స్పందించినప్పటికీ అప్పటికే దుర్గారావు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో సబ్స్టేషన్లో విషాద వాతావరణం నెలకొంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యుత్ అధికారుల ఏ ఈ బీమా నాయక్, si వెంకటరమణయ్య పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




