Markapuram: ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్!

Markapuram: మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 Sept 2026 3:15 PM IST
Markapuram
X

Markapuram: ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్!

Markapuram: మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. షరీఫ్, భద్ర, హాసన్, సాగర్, ప్రసాద్, శ్రీను పదోన్నతి పొందారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లను అభినందించారు. పోలీస్ శాఖలో పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుందని, ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ, విధుల్లో నిబద్ధతను కొనసాగించాలని సూచించారు.

పదోన్నతి పొందిన సిబ్బందికి పోలీస్ అధికారులు, తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పదోన్నతులు తమకు మరింత బాధ్యతను పెంచిందని సిబ్బంది పేర్కొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story