Kurnool: నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ బస్తిపాటి
Kurnool: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kurnool: నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ బస్తిపాటి
Kurnool: అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు.. దర్శనార్థం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఆలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.. దర్శనం అనంతరం అధికారులు స్వామి వారి శేషవస్త్రం, చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.. ఎంపీ వెంట స్థానిక టీడిపి నాయకులు పాల్గొన్నారు.
Next Story




