Koilakuntla: కోవెలకుంట్లలో విద్యార్థినులకు మహిళా భద్రతపై అవగాహన

Koilakuntla: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మహిళా భద్రతపై ఎస్సై మల్లికార్జున్ రెడ్డి అవగాహన సదస్సు. వేధింపులను ధైర్యంగా ఎదిరించాలని సూచన.

Ramanaiah, Banaganepalle
Published on: 16 Aug 2026 6:55 PM IST
Koilakuntla
X

Koilakuntla: కోవెలకుంట్లలో విద్యార్థినులకు మహిళా భద్రతపై అవగాహన

కోవెలకుంట్ల: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల లో ఉమెన్స్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించిన కోవెలకుంట్ల ఎస్సై మల్లికార్జున్ రెడ్డి. విద్యార్థులు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత కాలేజీల్లో సీనియర్ల వేధింపులు గురైతే తక్షణమే ఫిర్యాదు చేయాలి.

పోలీస్ హెల్ప్ లైన్ 100 లేదా 112 కి ఎప్పుడైనా ఫోన్ కాల్ చేయవచ్చు 181 ద్వారా ప్రత్యేక రక్షణ మరియు సలహాలు పొందవచ్చు. వేధింపులకు భయపడి వెనుకడుగు వేయకుండా గట్టిగా ఎదిరించాలి. కోవెలకుంట్ల పోలీసులు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారని ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులకు లేదా కాలేజీ యాజమాన్యానికి చెప్పాలని ఎస్సై మల్లికార్జున్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story