Kurnool: కర్నూలు జిల్లాలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు..

Kurnool: హోలగుంద, హలహర్వి కేజీబీవీలు, రేషన్ షాపులను తనిఖీ చేసిన చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి. నాణ్యమైన ఆహారం, సరుకులు ఇవ్వాలని ఆదేశం.

Bheemalinga, Aluru
Published on: 2 July 2026 6:46 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జిల్లాలో ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు..

కర్నూలు జిల్లా: హోలగుంద, హలహర్వి, మండలాల్లోని కేజీబీవీ హాస్టళ్లు, జడ్పీ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్) దుకాణాలను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కేజీబీవీ హాస్టళ్లలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, ఆహార నిల్వలు, వసతి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి భోజనం రుచి, నాణ్యత, హాస్టల్‌లో అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జడ్పీ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యతను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

అలాగే రేషన్ దుకాణాలను తనిఖీ చేసి, ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే నాణ్యమైన సరుకులను పారదర్శకంగా పంపిణీ చేయాలని రేషన్ డీలర్లు, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story