Nandyal: అంకిరెడ్డిపల్లెలో ఊరు పేరు లేని సచివాలయం నేమ్ బోర్డు లేక ప్రజల ఇబ్బందులు!

Nandyal: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో సచివాలయానికి నేమ్ బోర్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అద్దె భవనంలో నడుస్తున్న సచివాలయం.

Ramanaiah, Banaganepalle
Published on: 25 Aug 2026 4:13 PM IST
Nandyal
X

Nandyal: అంకిరెడ్డిపల్లెలో ఊరు పేరు లేని సచివాలయం నేమ్ బోర్డు లేక ప్రజల ఇబ్బందులు!

Nandyal: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఊరు పేరు లేని సచివాలయం.గత 3 సంవత్సరాలుగా నేమ్ బోర్డు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు. అంకిరెడ్డిపల్లె సచివాలయం గత 4 సంవత్సరాల నుండి అద్దె భవనంలోనే కొనసాగుతుంది.

అంకిరెడ్డిపల్లె గ్రామ జనాభా 6600 ఉంది ఉన్నారు సచివాలయం చుట్టూ ముళ్ల పొదలు అలుమూకొన్నాయీ, 1వ సచివాలయం 2 సచివాలయం రెండు కలిపి ఒకే సచివాలయం లో కొనసాగుతున్నాయి.6,600 మంది జనాభా ఉన్న అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఒకే సచివాలయం ప్రజలకు సేవలు అందుతున్నాయి.

వర్షం వస్తే సచివాలయానికి పోవడానికి బురదమయం అవుతుందని గ్రామస్తులు తెలిపారు, గ్రామంలో ఉన్న రెండు సచివాలయాలు గ్రామానికి దూరంగా కొండకు అనుకుని కట్టడంతో మధ్యలో ఆగిపోయాయని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. అధికారులు స్పందించి అంకిరెడ్డిపల్లె సచివాలయం బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story