Vuyyuru: లాడ్జ్‌లలో అక్రమ కార్యకలాపాలకు తావిస్తే చర్యలు.. ఉయ్యూరు సీఐ!

Vuyyuru: ఉయ్యూరు లాడ్జ్ యజమానులతో టౌన్ సీఐ టీవీవీ రామారావు సమావేశం. గుర్తింపు పత్రాలు తప్పనిసరని, అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.

Ramana, Penamaluru
Published on: 8 Sept 2026 3:17 PM IST
Vuyyuru
X

Vuyyuru: లాడ్జ్‌లలో అక్రమ కార్యకలాపాలకు తావిస్తే చర్యలు.. ఉయ్యూరు సీఐ!

Vuyyuru: పట్టణ పరిధిలోని లాడ్జ్ యజమానులు, నిర్వాహకులతో ఉయ్యూరు టౌన్ పోలీసులు సమావేశం నిర్వహించారు. లాడ్జ్‌లలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

లాడ్జ్‌లో బస చేసే ప్రతి వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, ఆధార్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని పరిశీలించిన అనంతరం మాత్రమే గదులు కేటాయించాలని స్పష్టం చేశారు. సందర్శకుల పేరు, చిరునామా, మొబైల్ నంబర్‌తో పాటు రాక, పోక సమయాలను రిజిస్టర్‌లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.

సరైన గుర్తింపు పత్రాలు లేకుండా వచ్చే వ్యక్తులకు, అనుమానాస్పద వివరాలు వెల్లడించే వారికి గదులు కేటాయించరాదని పోలీసులు హెచ్చరించారు. లాడ్జ్‌లను వ్యభిచారం, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయం, జూదం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

లాడ్జ్‌ల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలతో పాటు పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, వాటి రికార్డింగ్‌ను నిబంధనల ప్రకారం భద్రపరచాలని సూచించారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, ఎక్కువకాలం బస చేస్తూ సరైన వివరాలు వెల్లడించని వారు లేదా అనుమానం కలిగించే ప్రవర్తన కనిపించిన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

లాడ్జ్ నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తే నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత మెరుగుపరచవచ్చని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినా, తెలిసీ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సహకరించినా సంబంధిత లాడ్జ్ యాజమాన్యంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఉయ్యూరు టౌన్ సీఐ టీవీవీ రామారావు హెచ్చరించారు.

“లాడ్జ్‌కు వచ్చే ప్రతి వ్యక్తి గుర్తింపు తప్పనిసరి. అనుమానాస్పద, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావిస్తే చర్యలు తప్పవు” అని సీఐ స్పష్టం చేశారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story