Sathupalli: వైఎస్సార్ వర్ధంతి..ఎమ్మెల్యే మట్టా రాగమయి నివాళులు!

Sathupalli: సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 3 Sept 2026 6:49 AM IST
Sathupalli
X

Sathupalli: వైఎస్సార్ వర్ధంతి..ఎమ్మెల్యే మట్టా రాగమయి నివాళులు!

Sathupalli: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు దివంగత నేత స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని, మున్సిపల్ ఆఫీస్ వద్ద డాక్టర్ వైయస్సార్ విగ్రహం కు పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ .

ఈ సందర్భంగా mla మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని అందులో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రివైజ్మెంట్ ఇంజనీరింగ్ డాక్టర్ కోర్సులు కూడా పేద ప్రజలకు వికలాంగులకు పెన్షన్లు అందించిన ఘనత వయసుకే దక్కిందన్నారు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రాజెక్టులు రోడ్లు అభివృద్ధి పరచాలని ఆయన మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, తోట సుశీల రాణి దేవి శ్రీనివాస్ సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దామెర రమేష్ nsui అధ్యక్షులు సందీప్ గౌడ్ అనిల్ గౌడ్ కాంతారావు పింగిలి సామెల్ , వేములపల్లి మధు గఫార్ నాగుల మేర కంటే అప్పారావు నాగభూషణం కౌన్సిలర్స్, సర్పంచులు, ఉపసర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ లు, యూత్, NSUI నాయకులు, వైయస్సార్ గారి అభిమానులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story