Bhadrachalam: నేడు భద్రాచలం ఐటీడీఏ గిరిజన దర్బార్.. అధికారులకు ఆదేశాలు!

Bhadrachalam: ఐటీడీఏ గిరిజన దర్బార్, ప్రజావాణికి అధికారులు ఉదయం 10:30 గంటలకు విధిగా హాజరుకావాలని పీవో బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 7:09 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: నేడు భద్రాచలం ఐటీడీఏ గిరిజన దర్బార్.. అధికారులకు ఆదేశాలు!

భద్రాచలం సెప్టెంబర్ 6: సోమవారం నాడు భద్రాచలం ఐ టి డి ఏ, సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

గిరిజనులు మరియు ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని వారు తెలుపుతూ సంబంధిత యూనిట్ అధికారులు, డివిజన్ అధికారులు ఉదయం 10.30 గంటలకు భద్రాచలం ఐటీడీఏ మరియు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరాలలో తప్పకుండా హాజరుకావాలని వారు పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story