Khammam: పొదిల రవికుమార్ను పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధు
Khammam: ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొదిల రవికుమార్ తండ్రి దేవేంద్రనాథ్ మృతి పట్ల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.
Khammam: పొదిల రవికుమార్ను పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధు
Khammam: ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్వర్గీయ దేవేంద్రనాథ్ చిత్రపటానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు.ఖమ్మం వాస్తవ్యులు,ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ తండ్రి దేవేంద్రనాథ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తాతా మధు ఆదివారం సాయంత్రం స్వర్గీయ దేవేంద్రనాథ్-విజయలక్మీ దంపతుల చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు,రవికుమార్ ను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, బీఆర్ఎస్ నాయకుడు బెల్లం వేణు తదితరులు ఉన్నారు.




