Kalluru: 400 ట్రాక్టర్లతో బీఆర్ఎస్ భారీ రైతు గర్జన మాజీ ఎమ్మెల్యే సండ్ర

Kalluru: ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 400 ట్రాక్టర్లతో భారీ రైతు గర్జన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వాన్ని విమర్శించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 4 Sept 2026 11:40 AM IST
Kalluru
X

Kalluru: 400 ట్రాక్టర్లతో బీఆర్ఎస్ భారీ రైతు గర్జన మాజీ ఎమ్మెల్యే సండ్ర

Kalluru: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో రైతులకు చేసిందేమీ లేదని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సండ్ర వెంకట వీరయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ.. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కల్లూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ రైతు ర్యాలీ నిర్వహించారు. 400 ట్రాక్టర్లతో చెన్నూరు నుంచి కల్లూరు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ద్వారా తల్లాడ, కల్లూరు ప్రాంత రైతులకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అవసరమైతే ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని, చివరకు చెప్పులు, ఆధార్ కార్డులు లైన్లో పెట్టుకునే దుస్థితి ఏర్పడిందని సండ్ర విమర్శించారు. యూరియా కోసం యాప్‌ విధానం తీసుకొచ్చి రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

రైతుబంధు, రైతుబీమా, సీతారామ ప్రాజెక్టు వంటి కార్యక్రమాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని సండ్ర పేర్కొన్నారు. కల్లూరు ప్రాంత రైతాంగానికి సాగునీరు అందుతున్నదంటే అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, కృషి ఫలితమేనని అన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు 1000 రోజులు పూర్తయినా ఎందుకు అమలు చేయలేదని సండ్ర ప్రశ్నించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, పేదలు సహా ఏ వర్గం కూడా కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా లేదని విమర్శించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని సండ్ర హెచ్చరించారు. ప్రజలు, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాల కోసం అవసరమైతే ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామని సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story