Bhadrachalam: గోండి-కోయ భాషా ప్రామాణీకరణ వర్క్షాప్ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ!
Bhadrachalam: భద్రాచలంలో అక్టోబర్ 2 నుంచి గోండి-కోయ భాషా ప్రామాణీకరణ, డిక్షనరీ జాతీయ వర్క్షాప్. ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో బి. రాహుల్.
Bhadrachalam: గోండి-కోయ భాషా ప్రామాణీకరణ వర్క్షాప్ ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ!
Bhadrachalam: భద్రాచలం సెప్టెంబర్ 16- అక్టోబర్, 2 నుండి 6 వరకు 5 రోజుల పాటు జర్గనున్న జాతీయ స్థాయి కోయ గోండి భాషా ప్రామాణీకరణ, డిక్షనరీ వర్క్ షాప్ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు.
తన చాంబర్లో ఆదివాసి ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ కి ఐటీడీఏ ఆతిధ్య సహకారం అంధిస్తుండగా, జాతీయ గోండి కోయ భాషా ప్రామాణికరణ, డిక్షనరీ మరియు రికగ్నైషన్ సమన్వయ కమిటీ సమన్వయం చేస్తూ ఆర్గనైజ్ చేస్తుందని, ఈ కార్యక్రమానికి ఆంధ్రా, తెలంగాణతోపాటు, చ్చత్తిస్గడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్కండ్, అస్సాం మొత్తం 8 రాష్ట్రాల నుండి సుమారు 120 మంది కోయ గోండి ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన అన్నారు.ఈ వర్క్ షాప్ కి సాధ్యమైనంతవరకు ప్రముఖులతోపాటు అందరిని ఆహ్వానించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోండ్రు వీరాస్వామి, సీనియర్ కోయ భాషా రిసోర్స్ పర్సన్ పాయం వెంకటరత్నం, కారం దారయ్య, ఇర్ప రాధాకృష్ణ మూర్తి, కాక రాజు, కణితి రామకృష్ణ, వీసాల శ్రీలక్ష్మి, మడివి గురుత్వ, మడివి సూక్ష్మ తదితరులు పాల్గొన్నారు.




