Bhadrachalam: భద్రాచలంలో 1000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ: బార్ అసోసియేషన్
Bhadrachalam: భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివరాం నాయక్ చేతుల మీదుగా 1000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు.
Bhadrachalam: భద్రాచలంలో 1000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ: బార్ అసోసియేషన్
భద్రాచలం: భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పీవి కృష్ణమాచారి హైకోర్టు అడ్వకేట్ సహకారంతో ఉచిత గణపతి మట్టి ప్రతిమలపంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 1000 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంచిపెట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం జ్యుడీషియన్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ శ్రీ శివరాం నాయక్ పాల్గొని ఆయన చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహాలను పంచిపెట్టారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ ఈ మట్టి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా ఎటువంటి కాలుష్యం ఉండకపోవడమే కాకుండా కాకుండా పవిత్ర గోదావరి నదిలో ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తో కూడిన రసాయనాలతో తయారైన పర్యావరణానికి నీటికి జరిగే కాలుష్యాన్ని నివారించవచ్చని బార్ అసోసియేషన్ వారు తెలిపారు.




