Jammikunta: జమ్మికుంటలో 24 గంటల్లోనే తాగునీటి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్
Jammikunta: జమ్మికుంటలో కాలిపోయిన బావి మోటార్ను 24 గంటల్లోనే రిపేరు చేయించిన కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్. ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్లతో నీటి సరఫరా.
Jammikunta: జమ్మికుంటలో 24 గంటల్లోనే తాగునీటి సమస్య పరిష్కరించిన కౌన్సిలర్
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట కొత్తపల్లి. హై వోల్టేజ్ కరెంటు వల్ల బావి మోటర్ మరియు స్టాటర్ కాలిపోవడం జరిగింది. తక్షణమే స్పందించి మున్సిపల్ కమిషనర్ తో ఏ ఈ వికాస్ తో మాట్లడి వాటర్ సిబ్బందిని పిలిపించి మోటర్ని రిపేర్ కి ఇవ్వడం జరిగింది. వార్డు ప్రజలకు ఎలాంటి వాటర్ సమస్య రాకుండా తక్షణమే అధికారులతో మాట్లాడి మున్సిపల్ వాటర్ ట్యాంకర్స్ తెప్పించి. వార్డు ప్రజలకు నీళ్లు అందించడం జరిగింది. బావి మోటర్ ని తక్షణమే రిపేరు చేయించి 24 గంటలలోనే వార్డ్ ప్రజలకు యధావిధిగా నీరు అందించడం జరిగింది. ఇందుకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ గట్టుల మల్లికార్జున స్వామి గారికి. మరియు ఏఈ వికాస్ కి .పిట్టర్ స్వామి.వాటర్ బాయ్ పురుషోత్తం మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. త్వరగా స్పందించి 24 గంటల్లోనే తాగునీరు అందించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్.




