sircilla: మిడ్ మానేర్ లేటెస్ట్ అప్‌డేట్: ప్రాజెక్ట్‌లో ఎంత నీరుందో తెలుసా?

sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం వివరాలు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 18 May 2026 6:43 AM IST
sircilla
X

sircilla: మిడ్ మానేర్ లేటెస్ట్ అప్‌డేట్: ప్రాజెక్ట్‌లో ఎంత నీరుందో తెలుసా?

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ నీటిమట్టం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్ నీటిమట్టం 307.28 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 7.709 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలు. రిజర్వాయర్‌కు ఎలాంటి వరద ప్రవాహాలు నమోదు కాలేదు. ఎస్‌వైపీ (గోదావరి పంప్ హౌస్), ఎస్‌ఆర్‌ఎస్‌పీ, మానేర్, ములవాగు, ఎఫ్‌ఎఫ్‌సీ ఇన్‌లెట్ల ద్వారా ఇన్‌ఫ్లోలు లేవని అధికారులు వెల్లడించారు.

ఇక రిజర్వాయర్ నుంచి మొత్తం 140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో ఆవిరి రూపంలో 95 క్యూసెక్కులు, ఎంబీ ద్వారా 45 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. రైట్ సైడ్, రైట్ గేట్లు, ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ, ప్యాకేజ్-9, ప్యాకేజ్-10, జీసీఎల్ఎస్ మార్గాల ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు. రిజర్వాయర్ స్పిల్‌వే గేట్లు, రైట్ సైడ్ గేట్లు ప్రస్తుతం మూసివేసి ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయి.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story