Manthani: డంప్యాక్ట్‌లో అక్రమంగా చెత్త వేసిన వ్యక్తికి రూ. 10 వేల జరిమానా

Manthani: మంథని మున్సిపాలిటీ పరిధిలోని డంప్‌యార్డులో నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేసిన వ్యక్తికి అధికారులు రూ.10,000 జరిమానా విధించారు.

SHANKAR, MANTHANI
Published on: 22 Aug 2026 5:45 PM IST
Manthani
X

Manthani: డంప్యాక్ట్‌లో అక్రమంగా చెత్త వేసిన వ్యక్తికి రూ. 10 వేల జరిమానా

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని డంప్‌యార్డులో నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేసిన వ్యక్తికి మున్సిపల్ అధికారులు రూ.10,000 జరిమానా విధించారు. పట్టణంలో పారిశుధ్య నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

మున్సిపల్ పరిధిలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా మున్సిపాలిటీ నిర్దేశించిన ప్రదేశాల్లోనే చెత్తను వేయాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ మనోహర్ కోరారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story